మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరగణాన్ని కూడా రంగంలోకి దింపరు. మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుని ఆకాంక్షిస్తూ స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికెళ్లి తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. గెలుపుని ఆకాంక్షిస్తూ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. టిఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ , టిఎన్ఎస్ఎఫ్ నేతలు ఖమ్మం కార్పొరేటర్లు, ముస్లిం మైనారిటీ నాయకులు,ఖమ్మం నగర నాయకులు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.