33.2 C
Hyderabad
May 4, 2024 00: 21 AM
Slider ఖమ్మం

భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో రూ.2.58 కోట్ల రూపాయలతో ముక్కోటి వాగు పై అనంతారం R&B రోడ్డు నుండి కొత్తూరు వరకు నిర్మించనున్న బ్రిడ్జి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కరకగూడెం మండలం మోతే గ్రామంలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు, ఎడుళ్ళ బయ్యారం గ్రామంలో రూ. 3.11 కోట్లతో బయ్యారం నుండి via పాతరెడ్డి పాలెం మీదగా జగ్గారం గ్రామం వరకు నిర్మించనున్న BT రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, ASP శబరీష్, పంచాయతీ రాజ్ CE సుధాకర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Related posts

యాదాద్రి ప్రాకారం నిండా భక్తి ఉప్పొంగాలి

Satyam NEWS

ఆన్ లైన్ తరగతులు తల్లిదండ్రులకు భారమే

Satyam NEWS

అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలిచ్చేవరకు ఉద్యమం

Satyam NEWS

Leave a Comment