సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చింతకాయల రంగమ్మ రాములు వారి అనుచరులతో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో భూపతి శ్రీనివాస్, ఎం.సతీష్,ములకలపల్లి వీరబాబు,కర్నే నాగయ్య,నాగరాజు తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,ఎండి నిజాముద్దీన్,మంజు నాయక్, శెట్టి రామచంద్రయ్య,బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెర్వు ముక్కంటి,యడవెల్లి వీరబాబు,సుంకరి శివరాం,సవిత్రమ్మ, కాల్వ పెద్ద వెంకటేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్