ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయం లో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ధ్వజారోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత యాగశాల లో అంకురార్పణ పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభాన్ని శుద్ధి చేశారు. కంకణధారణ అనంతరం గరుత్మంతుని చి త్రం ఉన్న ధ్వజపటానికి శాస్త్రోకంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎగురవేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులకు గ్రామ పురవీధు ల్లో గ్రామోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
previous post