క్రీడారంగంలో దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకుచేర్చిన మహనీయుడు ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి పువ్వాడ మాట్లాడారు.
మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ,డి వై యస్ ఓ పరందామ రెడ్డి , వివిధ క్రీడల కోచ్ లు పాల్గొన్నారు.