గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో కాల్పులు కలకలం రేగింది. పొలం వివాదంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు కాల్పులకు తెగబడ్డట్టు పోలీసులు తెలిపారు.
మొత్తం అతను నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో మట్టా శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆంజనేయులు, బాలకృష్ణ అనే ఇద్దరి పరిస్దితి విషమంగా ఉంది.
గాయపడ్డ వారి ఇద్దరిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.