నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం దుకాణం తెరిచే సమయంలో శివసాయి గోల్డ్ షాప్ యజమాని తన బైక్ పై పెట్టిన బ్యాగును ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో బైకు పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బ్యాగులో 15 లక్షల విలువైన బంగారు నగలతో పాటు, డబ్బులు కూడా ఉన్నాయని చెబుతున్నాడు బాధితుడు. దొంగతనంపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులుకేసు దర్యాప్తు చేస్తున్నారు .
previous post