హైదరాబాద్ నల్లకుంట డివిజన్ లోని వివిధ ప్రాంతాలలో పేద ప్రజలకు, వలస కార్మికులకు కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. దాదాపు 100 మంది ఈ వస్తువులను అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ నల్లకుంట డివిజన్ ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటిలోనే ఉండాలని అనవసరంగా బయటకు రావొద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు K. శ్యామ్, ch. భగవాన్, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
previous post