ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బాధరాల గ్రామం లో విజయ పాల డైరీ తరపున బాధరాల పాలకేంద్రం లో
40 మంది పసిడి రైతులకు శనివారం పాల కేన్ లు పంపిణీ చేశారు. బాధరాల గ్రామం లో పాడి రైతులు సరైన పాల కేన్ లు లేక కేంద్రానికి పాలు తీసుకురావడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాలకేంద్ర నిర్వహకుడు నెల్లూరి రామ బ్రహ్మం పాడి రైతుల సమస్య విజయ పాలదైరి యాజమాన్యానికి తెలిపారు.
బాధరాల పాడిరైతుల సమస్యపై స్పందించిన వెంటనే పాల కేన్ లను సరఫరా చేశారని రామ బ్రహ్మమం తెలిపారు. బాధరాల రైతులు విజయ పాల డైరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.