అధికార పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నది. అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దలు పెట్టుబడులు భారీగా పెట్టినట్లు చెబుతున్న ప్రణీత్ గ్రూప్ కంపెనీ కార్యాలయాలపై ఐటి దాడులు జరగడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది. ప్రణీత్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ గా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కుమారుడు సందీప్ రావ్ ఉన్నారు. సందీప్ రావు తెలంగాణలో దాదాపు అన్ని కాంట్రాక్టులు తీసుకునే రెండు పెద్ద కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారని తెలిసింది. ఈ డబ్బు అంతా టిఆర్ఎస్ పెద్దల నుంచి వచ్చిందేనే ఆధారాలతో ఐటి దాడులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రణీత్ గ్రూప్ కంపెనీలో డైరెక్టరుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కుమారుడి పైనే ఐటి అధికారుల ప్రధాన దృష్టి ఉంది. ప్రణీత్ గ్రూప్ సంస్థ కార్యాలయాలతో పాటు యం.డి. నరేందర్, మరో ఐదు మంది డైరెక్టర్ల ఇళ్ళల్లో కూడా ఐటి దాడులు కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో నగదు లభ్యం అయినట్లు పుకార్లు వ్యాపించినా కూడా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.
previous post