కోదాడ, మిర్యాలగూడ రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారికి న్యాయం చేయాలని నేడు బాధితులు ఆర్ డి ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్.ఆర్.యు.సి సభ్యుడు, ఐ.యన్.టియు.సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు నేతృత్వంలో రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి రోడ్డు ప్రక్కన పేదలు గుడిసెలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని, రహదారి విస్తరణలో భాగంగా పేద కుటుంబాలు రోడ్డున పడ్డారని,అట్టి పేదలకు సరియైన న్యాయం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.యన్.టి.యు.సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,పట్టణ అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి, పాశం రామరాజు, పోతనబోయిన రామ్మూర్తి, ఎస్.కె.సైదా మేస్త్రి,ముశం సత్యనారాయణ,కోల మట్టయ్య,గృహ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
బి.చంద్రశేఖర్, సత్యం న్యూస్.నెట్