28.7 C
Hyderabad
May 5, 2024 08: 44 AM
Slider నల్గొండ

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

#hujurnagar

కోదాడ, మిర్యాలగూడ రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారికి న్యాయం చేయాలని నేడు బాధితులు ఆర్ డి ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్.ఆర్.యు.సి సభ్యుడు, ఐ.యన్.టియు.సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు నేతృత్వంలో రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి రోడ్డు ప్రక్కన పేదలు గుడిసెలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని, రహదారి విస్తరణలో భాగంగా పేద కుటుంబాలు రోడ్డున పడ్డారని,అట్టి పేదలకు సరియైన న్యాయం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.యన్.టి.యు.సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,పట్టణ అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి, పాశం రామరాజు, పోతనబోయిన రామ్మూర్తి, ఎస్.కె.సైదా మేస్త్రి,ముశం సత్యనారాయణ,కోల మట్టయ్య,గృహ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

బి.చంద్రశేఖర్, సత్యం న్యూస్.నెట్

Related posts

కార్తీకంలో గోమాతను దర్శించడం ఆనందంగా ఉంది

Satyam NEWS

మహిళా గవర్నర్ ను అవమాన పరిచి మహిళ బంధు కార్యక్రమమా?

Satyam NEWS

నేను తలుచుకుంటే అప్పుడే పెద్దిరెడ్డి ఆటలు కట్టించే వాడ్ని

Satyam NEWS

Leave a Comment