38.2 C
Hyderabad
May 5, 2024 22: 08 PM
Slider ప్రత్యేకం

నేను తలుచుకుంటే అప్పుడే పెద్దిరెడ్డి ఆటలు కట్టించే వాడ్ని

అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో శనివారం పుంగనూరు లో చంద్రబాబు నాయుడు పర్యటన లో దాడిపై రాజంపేట లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరు కాదని,రాచరిక పాలన ఎప్పుడో ముగిసిందని,ఆరునెలల్లో నీ పాలనకు చరమగీతం మొదలు కాబోతోందని అన్నారు.1972 లో చంద్రబాబు నాయుడు గెలిచి నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయాడని అన్నారు.తిరుపతి లో విద్యార్థి దశలో యూనివర్సిటీ లో పెద్దిరెడ్డి ఆటలు సాగి ఉండవచ్చునని, తాను స్టూడెంట్ గా వచ్చాక పెద్దిరెడ్డి కి చెక్ పెట్టానని అన్నారు.

ఇప్పటి గురించి అప్పట్లో తాను తలుచుకుంటే అప్పుడే పెద్దిరెడ్డి ఆటలు కట్టించి ఉండేవాడినని అన్నారు.జగన్మోహన్ రెడ్డి స్వంత మండలం పులివెందుల లో చంద్రబాబు నాయుడు సభ విజయ వంతం కావడంతో, చూసి ఓర్వలేక పెద్దిరెడ్డి పుంగనూరు లో దాడులు చేయించారని ఆరోపించారు.

టీడీపీ నేతలు,పోలీసులపై ఓ పథకం ప్రకారం దాడి చేసి న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, పార్టీ అధ్యక్షులు నాయుడు, దగ్గుపాటి సుబ్రమణ్యం నాయుడు, గన్నే సుబ్బనరసయ్య, టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కొండా శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య నాయుడు, తెలుగుయువత అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అనమలగుండం విజయ్ కుమార్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Related posts

రిక్వెస్టు: పసుపు పంటకు 15వేలు మద్దతు ధర కావాలి

Satyam NEWS

పార్టీ తుడిచిపెట్టుకుపోయినా మేం పదవి వదలం

Satyam NEWS

గో గ్రీన్: నటులు, నిర్మాతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment