హైందవ సంస్క్రుతిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని, పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమ శివునికి అత్యంత ఇష్టమై, సకల దేవతలు కొలువుండే గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని రామకృష్ణ కాలనిలోని నమో మిషన్ వందే గోశాలను మంత్రి గంగుల సందర్శించారు,
సకల శుభాలు కలుగజేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై, రాష్ట్రంలోని ప్రజలందరిపై ఆదేవుని కరుణ ఉండాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, వైస్ ఎంపీపీ వీరారెడ్డి, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల ఏకనందం తదితరులు పాల్గొన్నారు.