42.2 C
Hyderabad
May 3, 2024 16: 55 PM
Slider నిజామాబాద్

మహిళా గవర్నర్ ను అవమాన పరిచి మహిళ బంధు కార్యక్రమమా?

#arunatara

రాష్ట్ర ప్రథమ మహిళ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను అవమాన పరిచిన అధికార TRS పార్టీకి మహిళా బంధు పేరిట ఉత్సవాలు చేసే అర్హత లేదని కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. భారతీయ జనతా మహిళా మోర్చా  ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సర్వీసుల్లో సేవలు అందించి రిటైర్ అయిన, అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా  హాజరైన జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా  ప్రభుత్వం తరపున ఒక్కరూ పాల్గొన లేదని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించడం మరింత అన్యాయమని ఆమె అన్నారు. ఇలా రాజకీయ కోణంలో మహిళా గవర్నర్ ను అవమాన పరుస్తున్నారని అన్నారు.

మహిళలు దైర్యంగా ఉండి కుటుంబ సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. కేంద్రంలో ని మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం  మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులకు, అంగన్వాడీ వర్కర్స్ కి సన్మానం చేయటం ఆనందంగా ఉన్నదని అన్నారు.

Related posts

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

Satyam NEWS

ఇష్టారీతిలో చెలానాలు… తమకు మాత్రం పట్టని నిబంధనలు

Satyam NEWS

రేపటికి గానీ స్టైరిన్ గ్యాస్ కంట్రోల్ కాదు

Satyam NEWS

Leave a Comment