ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, వ్యాధిగ్రస్తులు మనోవ్యధకు లోనుకాకూడదని, ధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుత్తాల గోపి అన్నారు.
ఎయిడ్స్ డే సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యంతో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యంగంలోని ఆర్టిల్ 21 ప్రకారం భారత పౌరులందరు స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో జీవించే హక్కును పొందిఉన్నారని అన్నారు.
వ్యాధి గ్రస్తులతో అనుచితంగా ప్రవర్తించినట్లైతే చట్ట ప్రకారం శిక్షకు అర్హులవుతారన్నారు. వ్యాధి గ్రస్తులకు ఏదైనా న్యాయ సహాయం అవసరమైతే విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి సహాయం పొందవచ్చునని తెలిపారు.