40.2 C
Hyderabad
April 26, 2024 14: 00 PM
Slider హైదరాబాద్

డివిజన్‌లలోని పలు సమస్యలపై ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతి

#betisubhashreddy

ఉప్పల్‌ నియోజకవర్గంలోని చిల్కానగర్‌ డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌ (సౌత్‌)వెల్ఫేర్‌  సోసైటీ సభ్యులు కాలనీలో  విద్యుత్‌ స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోవటంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని వాటి స్థానంలో కొత్త విద్యుత్‌ స్తంభాలు పునరుద్దరించాలని ఎమ్మేల్యేకు  వినతి పత్రం అందజేశారు. ఎమ్మేల్యే వెంటనే స్పందించి సంబదిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గరిక సుధాకర్‌, జనుంపల్లి వెంకటేశ్వరెడ్డి,  ప్రశాంత్‌నగర్‌ అధ్యక్ష ఉపాధ్యక్షులు జి.సి.శేఖర్‌రెడ్డి, అయిలేశ్వర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి మధుసూధన్‌, కమిటీ సభ్యులు దత్తు వెంకటరమణ, మధుబాబుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాప్రా డివిజన్‌లో:

కాప్రా డవిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌ కాలని రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాలనీలోని అంతర్గత రోడ్లుకు సిసి రోడ్లు శాక్షన్‌ చేయించాలని హప్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మేల్యే స్పందించి సంబదిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నాయకులు గరిక సుధాకర్‌, మల్లేష్‌,  కాలనీ అధ్యక్ష ఉపాధ్యక్షులు కె.చంద్రమౌళి, ఉదయ్‌భాస్కర్‌, సెక్రటరీ పెంటారెడ్డి, జగ్గారెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Related posts

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం… వైసీపీకి షాక్

Satyam NEWS

గ‌ర్భీణీ స్ర్తీలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Sub Editor

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్

Satyam NEWS

Leave a Comment