27.7 C
Hyderabad
May 4, 2024 09: 12 AM
Slider ఖమ్మం

విద్యా విభాగ పరిశోధనపై నవీన్ కు డాక్టరేట్

#Kakatiya University

గిరిజనుల్లో విద్యా వ్యాప్తికి సంబంధించి పరిశోధనలు నిర్వహించిన గంగసాని నవీన్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ను అందజేశారు.

ఖమ్మంజిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నవీన్ ఎడ్యుకేషనల్ ఇంటివేటివ్స్ క్యారీడ్ అవుట్ ఆఫ్ బై ఐటిడిఏ భద్రాచలం – ఏ స్టడీ అనే అంశానికి సంబంధించి నవీన్ కు డాక్టరేట్ దక్కింది. ప్రొఫెసర్ గంటా రమేష్ పర్యవేక్షణలో నవీన్ పిహెచ్ డి ని పూర్తి చేశారు. నవీన్ పిహెచ్ సాధించడం పట్ల ఆయనను పలువురు అభినందించారు.

ప్రాథమిక విద్యను బ్రాహ్మణపల్లిలో, ఉన్నత విద్యను సిరిపురం, మధిర, వైరాలో ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో పిజి పూర్తి చేశారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలోని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో నవీన్ పని చేస్తున్నాడు.

Related posts

వేడుకగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీలోకి బిల్డర్ అమీర్

Satyam NEWS

సౌదీ అరేబియాలో భారీ గాలులు.. ఎగిరిప‌డ్డ ప్ర‌జ‌లు

Bhavani

Leave a Comment