ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ ఓటును పరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీలలో జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రతి ఓటరు తప్పని సరిగా తన పేరును పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు కానీ మార్పులు చేర్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నిర్దేశిత ఫారాలలో దరఖాస్తు చేయాలని చెప్పారు.
సలహాలు, సూచనలు కొరకు బుతుస్తాయి అధికారుల ను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ పరిశీలన కార్యక్రమంలో బాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.