29.7 C
Hyderabad
May 3, 2024 03: 43 AM
Slider ముఖ్యంశాలు

బిఆర్ఎస్ పార్టీలోకి బిల్డర్ అమీర్

#brsparty

రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల కోసం తీసుకుంటున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిల్డర్ అమీర్ నేతృతంలో మైనార్టీ యువత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమీర్ తో పాటు మైనార్టీ యువతకు డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంట్లో వ్యక్తిగా ఉన్నానని తెలిపారు.

ప్రజా సమస్యలే నా సమస్యలుగా భావించి ప్రజాసేవ చేశానని, జరగబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం బిల్డర్ అమీర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కమిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, ఆస్పత్రులు, బ్రిడ్జిల నిర్మాణం తో పాటు అనేక అభివృద్ధి పనులు పద్మారావు గౌడ్ చేశారని తెలిపారు. మైనార్టీలకు పెద్దపీట వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మైనార్టీలకు అండగా నిలిచారని కొనియాడారు. నిరుపేద మైనార్టీలకు షాదీ ముబారక్ పేరుతో కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. అందుకే పద్మారావు గౌడ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై మైనార్టీ యువతతో పెద్ద ఎత్తున పార్టీల చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, జావిద్, గణేష్, శ్రీనివాస్ గౌడ్ మైనార్టీ యువత భారీగా పాల్గొన్నారు.

Related posts

సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇక్షు’ మూవీ రిలీజ్

Satyam NEWS

విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్

Satyam NEWS

వైసిపి నేతలు, సాక్షి మీడియాపై పరువునష్టం దావా

Satyam NEWS

Leave a Comment