కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత డాక్యుమెంటు రైటర్లు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. కొల్లాపూర్ చుట్టూ వున్న ప్రాంతాలలో కరోనా విజృంభింస్తున్నందున ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని డాక్యుమెంటు రైటర్లు సూచిస్తున్నారు.
ఇందులో భాగంగా కొల్లాపూర్ టౌన్ లో డాక్యుమెంటు రైటర్ లు ఈ రోజు నుండి ఆగస్టు నెల 5వ తేది వరకు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి రైతులు, భూముల ప్లాట్ల క్రయ విక్రయ దారులు గమనించాలని వారు కోరారు. కరోనా వల్ల తాము స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోని సహకరించగలరని వారు కోరారు.