25.7 C
Hyderabad
May 24, 2025 09: 02 AM
Slider నల్గొండ

సేవ్ ఇండియా ఉద్యమంలో పార్టీలకతీతంగా పాల్గొనాలి

#Save India

జూలై 23 నుండి ఆగస్టు 9 వరకు సేవ్ ఇండియా ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని, దేశ సంపదను కాపాడుకోవాలని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రజలను కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పారిశ్రామ వాడలో జూలై 23 నుండి ఆగస్టు 9 వరకు వివిధ రూపాలలో ప్రదర్శన నిర్వహించాలని, కార్మిక, వ్యవసాయ కర్షక సంఘాల పిలుపు విజయవంతం చేయాలని ప్రదర్శన నిర్వహించారు.

ఈ ప్రదర్శనలో రోషపతి మాట్లాడుతూ కార్పోరేట్ కంపెనీల అధిపతులు ఎగ్గొట్టిన అప్పుల నీటిని వసూలు చేయాలని, రైతుల అప్పులు అన్నింటిని రద్దు చేయాలని, కార్మిక చట్టాల సవరణ ఆపాలని, మున్సిపల్ పరిధిలో ఉపాధి హామీ అమలు చేయాలని, రోజు ఒక్కంటికి 600 రూపాయలు ఇవ్వాలని, ఇంటింటికి కరోనా పరీక్షలు చేయాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  సాముల కోటమ్మ, సోమయ్య గౌడ్, జయమ్మ, ముత్తమ్మ, మంగమ్మ, కుమారి, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేన్సర్ చికిత్సలో హోమియో వైద్యంతో మంచి ఫలితాలు

Satyam NEWS

గ్రామ అభివృద్ధి బాధ్యత మీదే: పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి

Satyam NEWS

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!