కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు తోషిబా ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రై లిమిటెడ్ 20 లక్షల రూపాయలు ఇచ్చింది. టిటిడిఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి కనెటా మాట్లాడుతూ కోవిడ్-19 సంక్షోభం దశాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల్లో అతి పెద్దదని ఆయన అని అన్నారు.
దీనికి సంబంధించిన సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున అందులో భాగంగా తమ వంతు సాయం చేస్తున్నామని చెప్పారు. అదనంగా, టిటిడిఐ ఉద్యోగులు తమ మే 2020 జీతం నుండి స్వచ్ఛంద జీతం తగ్గింపును కూడా విరాళంగా ఇచ్చారని ఆయన అన్నారు.
హిరోషి కనేటాతో పాటు, డైరెక్టర్ (హెచ్ఆర్ & లీగల్) కట్సుషి మోరిమోటో, తోషిబాకు చెందిన జిఎం (హెచ్ఆర్) జి.ఎ. రామకృష్ణ, ఇతర హెచ్ఆర్ బృంద సభ్యులు యూనియన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్లో మంత్రి కె. టి రామారావుకు చెక్ అందజేశారు.
టిటిడిఐ ఉద్యోగులు, యాజమాన్యాలకు వారి సహృదయానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చెక్కును అందజేస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, మహిళలు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు.