చైనా చేతిలో చావుదెబ్బ తిన్న ఇండియా తమ దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంవైపు కన్నెత్తి చూసినా తాము ఊరుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
హిమాలయాలలో వివాదాస్పద ప్రాంతంలో జరిగిన దాడిలో ఇండియా చైనా చేతిలో చావుదెబ్బతిన్నదని, తన 20 మంది సైనికులను కోల్పోయిందని ఆయన అన్నారు. చైనాతో ఈ భంగపాటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పాకిస్తాన్ వైపు ఇండియా చూస్తున్నదని ఆయన అన్నారు. ఇండియా కనుక సాహసం చేస్తే చైనా తరహా భంగపాటు తప్పదని ఆయన అన్నారు.