బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాబ్ నగర్ లో గత పది రోజులుగా మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తవ్వడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోయాయి. దాంతో రోడ్లన్నీ మురుగునీటి మయం అయ్యాయి. వారం రోజులుగా మొత్తం మురికి నీరు రోడ్డు మీద షాపుల ముందు నిలిచిపోయింది. మురికి నీళ్లు నిలబడి ఉండడంతో షాపు యజమానులు నరకయాతన అనుభవిస్తున్నారు. టిఫిన్ సెంటర్ వాళ్లకు కూడా గిరాకీ కావడం లేదని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటర్ డిపార్ట్మెంట్ వాళ్లు వెంటనే సమస్య పరిష్కారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తీవ్ర ఇబ్బంది కలుగుతుందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట