గనులలో భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎమ్ఎస్) దక్షిణ మధ్య జోన్ కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లతో ఈ రోజు ఒక సమావేశం జరిగింది. గనుల భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అనుసరించవలసిన ప్రణాళిక గురించి ఈ సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమం లో వివిధ జోన్లకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ సి. రమేష్ కుమార్, గుబ్బా విజయ్ కుమార్, డి.కె. సాహో, మలయ్ టికడర్, కె.ఎస్. యాదవ్, ప్రభాత్ కుమార్,సౌత్ సెంట్రల్ జోన్ కు సంబంధించిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో 92 ట్రేడ్ యూనియన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.