33.2 C
Hyderabad
May 4, 2024 02: 19 AM
Slider కృష్ణ

మైనారిటీ నాయకుడి పై గంజాయి కేసు పెట్టించిన నరసరావుపేట ఎమ్మెల్యే

#chandrababu

ఎంఐఎం నేత,పేద ముస్లిం మైనారిటీ నాయకుడు మస్తాన్ వలి పై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అక్రమ గంజాయి కేసు బనాయింపజేయడం దుర్మార్గమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.

మస్తాన్ వలి అక్రమ అరెస్టును ఖండిస్తు ఎం.ఐ.ఎం,ప్రజా సంఘాల నాయకులతో కలిసి డా౹౹చదలవాడ అరవింద బాబు టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం కలిసి సమస్యను విన్నవించారు. సమస్య విన్న అధినేత చంద్రబాబు నాయుడు మస్తాన్ వలి అక్రమ అరెస్ట్ ను ఖండించారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలంలో ఉన్న మసీదు ఎమ్మెల్యే బినామీలు వైసీపీ నాయకులు అధికారం అడ్డం పెట్టుకొని లీజుతో అక్కడ ఉన్న పేదలకు అన్యాయం చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అన్యాయమని ప్రశ్నించిన ఎం.ఐ.ఎం నాయకుడు మస్తాన్ వలి పై గంజాయి అక్రమ కేసు నమోదు చేయించి అరెస్టు చేయటం ఎమ్మెల్యే నియంత్రత్వ పోకడకు నిదర్శనం అని అన్నారు.

మస్తాన్ వలికి జరిగిన అన్యాయం, ఎమ్మెల్యే గోపిరెడ్డి చేస్తున్న ఆగడాలను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అన్యాయం జరిగిన వారికి టీడీపీ అండగా ఉంటుందని అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారని అన్నారు. ఎం.ఐ.ఎం పార్టీ నాయకులు మౌలాలి,కరిముల్లా మాట్లాడుతూ ఓవైసీ పిలుపు మేరకు 2019 ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి ఓటు వేస్తే దాడులు ల,అక్రమ కేసులు బనాయిస్తూ అణచివేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

90 శాతం వికలాంగుడని చూడకుండా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గంగా గంజాయి కేసు పెట్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం పై ప్రతిపక్ష నాయకుడు డా౹౹చదలవాడ అరవింద బాబును కలవడం జరిగిందని,వారు మాకు అండగా ఉంటారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని పాలనను చూసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే ముస్లిం మైనారిటీల పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులు,బీసీలు,ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేస్తూ అణచివేస్తున్నారని విమర్శించారు. మస్తాన్ వలికి న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలిచి పోరాడుతామని తెలిపారు.

Related posts

పెరేడ్: అధికార వికేంద్రీకరణతో పాలన మరింత చేరువ

Satyam NEWS

ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కొరియర్ సేవలు

Satyam NEWS

Vijayanagaram police: నో యాక్సిడెంట్ డే గా సిబ్బందితో ప్ర‌త్యేక చ‌ర్య‌లు

Satyam NEWS

Leave a Comment