విజయనగరం పైడితల్లి సిరిమాను ఉత్సవాల సందర్భంగా… ఆసక్తి కరమైన..ఆశ్చర్య పోయిన ఘటన ఒకటి కనిపించింది. ఉత్సవాల సందర్భంగా ముందు రోజే నుంచీ మద్యం నిషేధం విధించింది… జిల్లా యంత్రాంగం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా… పోలీసు శాఖకే మచ్చ తీసుకోచ్చాడో..ఖాకీ. ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పోలీసు బందోబస్తు తో పాటు… ఇతర జిల్లా ల నుంచీ కూడా పోలీసులు బందోబస్తు గా వచ్చారు. వాళ్లందరికీ భోజన వసతికై..నగరంలో ని ఎన్.సీ.ఎస్.థియేటర్ వద్ద…వసతి కల్పించారు.
ఇదిలా ఉంటే బందోబస్తు కై వచ్చిన ఎస్కే పాడుకు చెందిన ఏఎస్ఐ జీ.రమేష్ నాయుడు… ఫుల్ గా మద్యం సేవించి సరిగ్గా డిప్యూటీ స్పీకర్ ఇంటి ముందు చతికిల పడ్డాడు.సంబరాలు సడేమియా అన్నట్లు మందు..అందలో ఖాకీ.. అదీ లేడు పోలీసు బాస్ ఎస్పీ గా ఉన్న విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా… మద్య నిషేధం ఉన్న సమయంలో.. సదరు ఏఎస్ఐ మందుకొట్టి..పడి ఉండటం.. ఆ విషయం కాస్త సత్యం న్యూస్. నెట్ కు తెలిసిన వెంటనే క్లిక్ మనిపించడమే కాక…ఆ మత్తులో సదరు ఎఏస్ఐ ఆడిన దుర్భాషలకు…డిప్యూటీ స్పీకర్ ఇంటి ముందు పబ్లిక్ గుమిగూడారు.
అంతలో శాఖా సిబ్బంది అక్కడికి చేరుకుని… సదరు ఏఎస్ఐ ని…సిబ్బందికి కేటాయించిన రూంకు తీసుకెళ్లారు. ఏదైనా పండుగ పర్వదినాన..అదీ తొలేళ్ల ఉత్సవం రోజున,.భక్తులు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు కై ఉండాల్సిన ఖాకీనే ఇలా మందు కొట్టి పబ్లిక్ గా దొరికిపోవడం…అదీ డిప్యూటీ స్పీకర్ ఇంటి ముందే పడిపోవడం…ఏంటని ప్రశ్నిస్తున్నారు.. చూసిన ప్రజలు