ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో ని ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్ లో ఆదివారం శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు కుంకుమార్చన , పూజలు ఘనంగా నిర్వహించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కాలనీ అధ్యక్షులు కొత్త అంజి రెడ్డి తెలిపారు. మూడవరోజు ఉత్సవాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారని ఉత్సవ కన్వీనర్ నవిత కృష్ణారెడ్డి, కో కన్వీనర్ నాగమణి హరిబాబు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 50 వేలు విరాళంగా అందజేసిన కాలనీకి చెందిన సుజాత నరేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.