33.2 C
Hyderabad
May 4, 2024 02: 11 AM
Slider మహబూబ్ నగర్

ఈదమ్మ తల్లికి మొక్కులు చెలించుకున్న కౌన్సిలర్లు

Eedamma Jatara

కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని  ఈదమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈదమ్మ జాతర ఐదు వారాలు కొనసాగుతుంది. ఈరోజు  రెండవ వారం జాతర జరుగుతున్నది. భక్తులు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుండి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈవారం షిడే వారం ఒక ప్రత్యేకత ఉన్నది.

ఈ సందర్భంగా  ఇసుక పోస్తే రాలనంత జనం జాతరకు వస్తున్నారు. ప్రత్యేకంగా ఎద్దుల బండ్లలో రైతులు దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, రైతులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈదమ్మ తల్లికి బోనం ఎత్తి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇదే సందర్భంగా కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు ఈదమ్మ తల్లికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు 16 వ వార్డు కౌన్సిలర్ నరసింహారావు, పదో వార్డు కౌన్సిలర్ షేక్ రహీం పాషా, మూడో వార్డు కౌన్సిలర్ మాచుపల్లి బాలస్వామి, 9వ వార్డు కౌన్సిలర్ నయీమ్, రెండవ వార్డు కౌన్సిలర్ దంపతులు రెడ్డి రమేష్, 13వ వార్డు కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్, 11వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి కరుణ మహేష్, 8వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ వేణు యాదవ్ మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

రహస్యంగా బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు

Satyam NEWS

చైనా పీచమణిచే బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

జీహెచ్ఎంసీ పబ్లిక్ టాక్ (ప్రజావాణి)

Sub Editor

Leave a Comment