విద్యార్థిని గొంతు కోసి దారుణ హత్యకు కారకుడైన హంతకుని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ లో రాధిక అనే ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేసిన హంతకుణ్ని కఠినంగా శిక్షించాలని ఈరోజు కరీంనగర్ లో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసి ర్యాలీలో మానవహారం, ధర్నాలో పాల్గొనడం జరిగింది. పలువురు విద్యాసంస్థల నుండి విద్యార్థులు తెలంగాణ చౌక్ లో మానవహారం ఏర్పడి విద్యార్థులు మద్దతు తెలిపారు.
previous post