38.2 C
Hyderabad
May 2, 2024 19: 23 PM
Slider ముఖ్యంశాలు

నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

#badejythi

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ కొన్ని పనులు కావాల్సి ఉన్నది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక. తప్పకుండా ముఖ్యమంత్రిని కలవాలి. గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లను కలవాలి, మాట్లాడాలి. మీ ఎమ్మెల్యే ఎన్నడూ రాదు. ఏం అడగదు. మాకు తోచినవి.. తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ అడుగదు. ఏం చేసిర్రు మీరు అంటే.. ఏం చేయలేదు ? మీ కాంగ్రెస్‌ పాలనలో మంచినీరు ఇచ్చారా? కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఇచ్చారా? రైతుబంధు ఇచ్చారా? మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం కదా? మీ కాంగ్రెస్‌ కాలంలో పోడు భూములు పంచారా? ఇవాళ మేం పంచినం కదా? మరి ఏం చేశారంటే..? నేను చెప్పేదంటే ఈ వాదులాటలు కాదు. జరగాల్సింది ప్రజల క్షేమం’ అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపుడే కదా..?ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉంటయ్‌. రోడ్లు, ఇరిగేషన్‌ అన్నీ చేసిపెడుతానని వాగ్ధానం చేస్తున్నా. బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్‌ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్‌కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాకు వచ్చింది’ అన్నారు.

నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట..నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్‌ టైమ్‌ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్‌ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగతయ్‌. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసినపెడుతాను’ అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Related posts

హైదరాబాద్ లో ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ త్వరలో

Bhavani

బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కృష్ణయ్య

Satyam NEWS

అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

Satyam NEWS

Leave a Comment