29.7 C
Hyderabad
April 29, 2024 08: 22 AM
Slider జాతీయం

బీజేపీకి బీఆర్ఎస్ మినహాయింపు కాదు

#maniksarkar

బీజేపీకి బీఆర్ఎస్ మినహాయింపు కాదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకే కాదు దేశానికి అతి ముఖ్యమైనవిగా భావించాలన్నారు. దేశాన్ని విభజించి పాలించే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. స్వాతంత్ర్య వ్యవస్థను అణచివేస్తుందని తెలిపారు. అందుకే బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలోనూ ఈ రకంగా ముందుకు వచ్చామన్నారు.

బీజెపీ, బీఆర్ఎస్ ల 9 ఏళ్ల పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు, నిరుద్యోగిత బాగా పెరిగాయని అన్నారు. ఖమ్మం నియోజకవర్గం సీపీఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల రోడ్ షోకు‌ మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం గాంధీచౌక్ లో ప్రారంభమైన రోడ్ షో 3 టౌన్ వ్యాప్తంగా కొనసాగింది. స్థానిక బోస్ బొమ్మ సెంటర్లో ఈ రోడ్ షో ను ఉద్దేశించి త్రిపుర మాజీ సీఎం మాట్లాడారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాలని కోరారు. దేశంలో వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన బీజెపీని ఓడించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా తెలంగాణలోనూ ఇదే నినాదంతో ముందుకు వచ్చామన్నారు. 19 స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాదు.. తమ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపితే ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నిస్తారని తెలిపారు.

50 ఏళ్లలో పెరిగిన నిరుద్యోగం కంటే బీజేపీ పాలనలో ఈ తొమ్మిదేళ్లలో గణనీయంగా పెరిగిందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని, ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిందన్నారు. దేశాన్ని విభజించి పాలించాలనే యోచనతో ఉన్న బిజెపి కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అన్నారు. ప్రజా పోరాటాలను అదుపు చేయలేక పౌర హక్కులను అణచివేస్తుందన్నారు. రాజ్యాంగం పైనా దాడి చేస్తుందని తెలిపారు.

బిజెపికి బీఆర్ఎస్ పాలన కూడా ఏమాత్రం మినహాయింపు కాదని మాణిక్ సర్కార్ తెలిపారు. రాష్ట్రంలోనూ నిరుద్యోగిత బాగా పెరిగింది అన్నారు. షెడ్యూల్ కులాలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విద్యా, ఆరోగ్యం ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిందని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం అణచివేస్తుందని, మీడియాను కూడా స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోనివ్వడం లేదని ఆరోపించారు.

సీపీఎం లాగా ప్రజా అనుకూలంగా పోరాడే పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న యర్రా శ్రీకాంత్ ను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. సీపీఎం ప్రజలను నమ్మితే ఇతర పార్టీలు డబ్బులు నమ్ముకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. రూ.మూడు, రెండు వేల చొప్పున పంపకాలు మొదలయ్యాయని తెలిపారు.

అదంతా కష్టజీవుల సంపదే అన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మార్కెట్ తరలింపు.. ఇతర ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర సిపిఐ(ఎం) అభ్యర్థికి మాత్రమే ఉందని గుర్తు చేశారు. పార్టీలు మారే వాళ్లకు ఓట్లు వేయ్యాలా.. మారని వాళ్లకు వేయాలా ఆలోచించి ఓటేయాల్సిందిగా అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కోరారు. ఈ రోడ్ షోలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వై. విక్రమ్, కార్పొరేటర్లు యల్లంపల్లి వెంకట్రావు, యర్రా గోపీ, సీపీఐ (ఎం) జిల్లా నాయకులు యర్రా శ్రీనివాస్, ఎస్ నవీన్ రెడ్డి, తుమ్మా విష్ణు, పి.రమ్య, భూక్యా శ్రీనివాస్, బండారు యాకయ్య, రమేష్, వజినేపల్లి శ్రీనివాస్, యర్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాబిన్ శర్మ టీంతో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం

Bhavani

లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్‌లో వెంకన్న ఆలయం

Satyam NEWS

ఘనంగా మాలమహానాడు వ్యవస్థాపకుడు పివి రావు వర్ధంతి

Satyam NEWS

Leave a Comment