28.7 C
Hyderabad
May 5, 2024 23: 11 PM
Slider మహబూబ్ నగర్

ఎన్నికలను వనపర్తి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలి

#wanaparthy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా తనవంతు సహకారం అందించాలని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. ఎస్పీ కార్యాలయంలో వనపర్తి డిఎస్పీ ఆనంద రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిరహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అంశాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
అదేవిధంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ అందుబాటులో ఉందన్నారు. 1950 రోల్ ఫ్రీ లేదా గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ముందస్తు అనుమతి ఇచ్చేందుకు యం.సి.సి. సర్వసిద్ధంగా ఉందని తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రావమ్మా ..

Satyam NEWS

బండి సంజయ్ అరెస్టు కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ సమాయత్తం

Satyam NEWS

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani

Leave a Comment