37.7 C
Hyderabad
May 4, 2024 14: 07 PM
Slider నిజామాబాద్

వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిచిన కాంగ్రెస్

#neelamramesh

కొన్ని కోట్ల గుండెల్ని గెలిచిన వైఎస్ఆర్ ను ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మరిచిందని వైఎస్ఆర్టీపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు. ‘అయ్యా రాహుల్, అమ్మా ప్రియాంక ఈరోజు మీరు తెలంగాణలో తిరుగుతున్నారంటే అది వైస్సార్ ఇచ్చిన దైర్యం.. అది వైస్సార్ పెట్టిన బిక్ష.. అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడ్డుకుంటున్నారని, ఆయన పేరు కూడా పలకడం మర్చిపోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు అని ప్రశ్నించారు.

అయ్యా రేవంత్ రెడ్డి.. నువ్వు తెలుగు వాడివే కదా.. తెలంగాణ వాడినని చెప్పుకుంటావ్ కదా.. నీకు కూడా వైఎస్ఆర్ గుర్తుకు రాలేదా.. లేదా భయపడుతున్నావా? అని నిలదీశారు. వైఎస్ఆర్ పేరు చెబితే ఎక్కడ అయన కూతురు షర్మిలమ్మ ఉండగా మాకు నువ్వెందుకని ప్రజలు ఛీ కొడతారని భయపడుతున్నావా? అని ప్రశ్నించారు. వైస్సార్ లేని కాంగ్రెస్ ఎక్కడ ఉందిషబ్బీర్ అలీ.. అని నిలదీశారు. మీరు చెప్తున్న పథకాలు పేపర్ వరకే పరిమితమని, వైఎస్ఆర్ ఇచ్చిన పథకాలు ఇప్పటికి ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు.  తాత అవ్వల నవ్వులో ఆరోగ్య శ్రీ ఉందని, నేడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న యువతకు   ఫీజు రియింబుర్స్మెంట్ గుర్తుందని, కొన్నిలక్షల గుండెల ప్రాణాలు కాపాడిన 108 మర్చిపోలేదని పేర్కొన్నారు.

Related posts

సాగు,త్రాగునీరు అందించడమే  తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

త్రివర్ణపతాక

Satyam NEWS

విద్యార్థులకు ఇంగ్లీషు గ్రామర్ ను సులభతరం చేసిన బిఎన్ఆర్

Satyam NEWS

Leave a Comment