అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని రోడ్డు కింది భాగంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లు ఉండడంతో ఆవి విద్యుత్ తగిలి పలు మూగ జీవాలు అక్కడి కక్కడే మృతి చెందు తున్నాయి.శనివారం రైల్వే స్టేషన్ సమీపంలో సరస్వతీ పురం గురుస్వామి రాజు కాలనీలో సెల్ టవర్ రోడ్డుకు దిగువున ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తగిలి లేగ దూడ మృతి చెందింది.ట్రాన్స్ఫార్మర్స్ ఎత్తు పెంచమని విద్యుత్ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించు కుకోలేదని స్థానికుల ఆరోపించారు. అదే విధంగా గతవారం ఊటుకూరు గ్రామం నేషనల్ హైవే సమీపంలో ని సబ్ రోడ్డు లో శుక్రవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ తగిలి సూటి ఆవు మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్స్ ఎత్తు తగ్గడంతో ముగ జీవాలు ట్రాన్స్ఫార్మర్స్ తగిలి షాక్ తో మృతి చెందుతున్నా యని,ఇప్పటికయినా అధికారులు ట్రాన్స్ పార్మర్ ల ఎత్తు పెంచి రక్షణ కవచం ఏర్పాటు చేయాలని,మానవ ప్రాణ హాని జరగక కుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు….
previous post