ఒడిస్సాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఒడిస్సా కంధమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.