దేశ ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్న కార్యక్రమం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు.
నేడు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ.. రేపు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా యసంగి పంట కోసం 9 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మన్ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారని తెలిపారు.
అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాబై ఒక్క వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని అన్నారు.
అనంతరం వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్వయంగా మోది రైతులనుద్దేశించి ప్రసంగిచనున్నారని రేపు మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డులో ఎల్ఈడీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హాజరుకానున్నారని చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని రైతులు, సామాజిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గోని రైతు చట్టాలపై అవగాహన చేసుకోవాల్సిందిగా కోరారు.