అక్రమ నిర్మాణాలు చేస్తున్న మల్లం పేట లక్ష్మి శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ పై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బిజెపి నేతలు కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా 260 అక్రమ విల్లాలను వారు నిర్మాణం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. బిల్డింగులు సీజ్ చేసినా కూడా లక్ష్మి శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ ఆగడం లేదని వారన్నారు. కత్వ చెరువులో నిర్మాణాల కూల్చివేత పై అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అతి త్వరలో దుండిగల్ బిజెపి నాయకులు గవర్నర్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి కోశాధికారి కృష్ణారెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్, దుండిగల్ బిజెపి ఉపాధ్యక్షులు మురళి జిల్లా బిజెపి నాయకులు నర్సింగ్ ఎస్టి మోర్చా నాయకులు బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
next post