హైదరాబాద్ లోని ఉప్పల్ ఏషియన్ శ్రీనివాస సినిమా ధియేటర్ లో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ రాష్ట్ర సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సినిమా ధియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్ మారన్న సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకులు కోమటి రవి ఉప్పల్ సర్కిల్ సిఐటియు కార్యదర్శి జై వెంకన్న లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ధియేటర్ లలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 7500 రూపాయలు బియ్యం పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు సిఐటియు తమ వంతు సహాయం చేసిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి పుల్లారావు కార్యదర్శి ఇ అరుణ్ సాగర్ నాయకులు సత్తయ్య కమలాకర్ గౌడ్ రాజశేఖర్ శంకర్ ఆర్తి పటేల్ పాల్గొన్నారు.