సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో 25 వ, వార్డు కౌన్సిలర్ అస్మా నసీర్ ఏర్పాటుచేసిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ హిందూ-ముస్లీమ్ లు సోదర భావాన్ని కలిగి ఉండటం అవసరమని ఆయన అన్నారు.
అదే రంజాన్ పండుగ అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, రహీం, జిలాని ,శీను రాము, సైదా, తదితరులు పాల్గొన్నారు.