భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు సాజిద్ ఖాన్ పరామర్శించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓల్డ్ ఎస్సీ కాలనీ, దుబార్పెట్ గ్రామాలలో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇండ్లు మునిగిపోయి సర్వం కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన. ఈ కార్యక్రమం లో బోథ్ నియోజక వర్గ ఇంచార్జ్ ఆడే గజెందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమూద్ ఖాన్, మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి ఎస్సీ సెల్ నియోజక వర్గ చైర్మన్ లక్ష్మన్,మైనార్టీ సెల్ చైర్మన్ ముస్తఫా,జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్,అధికార ప్రతినిధి చంటి పసుల,ఎస్టీ సెల్ చైర్మన్ ఆనంద్ రావు,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతిరామ్,అదిలాబాద్ పట్టణ అధ్యక్షులు నగేష్, బోథ్ మండల అధ్యక్షులు మహేందర్,సిరికొండ అధ్యక్షులు ఇమామ్, బజార్హ త్నూర్ అధ్యక్షులు శేఖర్ సామన్ పెల్లి, గుడిహత్నూర్ అధ్యక్షులు కరుణాకర్,నాయకులు రాజు యాదవ్,మాధవ్ పటేల్,బొడ్డు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.