కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన రాష్ట్ర కార్యదర్శి రామయ్య ఆధ్వర్యంలో శనివారం గుడ్ మార్నింగ్ సీఎం సార్ మారోడ్ల గుంతలను బాగు చేయండని జన సైనికులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టాలు అధిక ఇసుక వాహనాలు వల్ల దెబ్బతిన్న రోడ్లను జనసైనికులు పర్యటించారు.రోడ్ల అభివృద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇంతవరకు రోడ్ల అభివృద్ధి చేయలేదని కేవలం మాటలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదని 108 వాహనం వెళ్లాలన్న కూడా రోడ్ల గొంతులతో అవస్థలు పడుతున్నారని జనసైనికులు మండిపడ్డారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ సిద్ధవటం ప్రధాన రహదారి ఎక్కడ చూసినా గుంతల మయం తప్ప ఇంకొకటి లేదని అధిక ఇసుక వాహనాల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇసుక వాహనం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయబ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు రోడ్లు అధిక గుంతలు అయిపోయాయని తెలియజేశారు జనసేన అధ్యక్షులు కె. రాజేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో ఉంటూ హెలికాప్టర్లో వెళుతూ దళితులు అష్టకష్టాలు పడుతూ ఉంటే కేవలం ఇసుక లిక్కర్ నందు పేద ప్రజల రక్తం పిండి సొమ్ము చేసు కుంటున్నారని రోడ్లు ఎక్కడ చూసినా గుంతల మయం తప్ప ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు చెయ్యలేదని ఇకనైనా రోడ్లు అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి కళ్యాణ్ ఎం నాగరాజు గురు ప్రసాద్ నవీన్ కుమార్ అల్లం శివ,ఏ నాగరాజా తదితర జనసైనికులు గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాం లో పాల్గొన్నారు