లాక్ డౌన్ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కడపజిల్లా రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి నిత్యావసర వస్తువులు అందించారు. బోయినపల్లె లోని మేడా భవన్ లో ఆదివారం టీటీడీ బోర్డు సభ్యడు రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
యోగేశ్వర్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ప్రతి జర్నలిస్టు కి 25 కేజీల రైస్ ప్యాకెట్ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఇంకా ఈకార్యక్రమం లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారితో పాటుగా వైసీపీ నేతలు గడ్డం జనార్దన్ రెడ్డి, కటారు సుబ్బరామిరెడ్డి లు పాల్గొన్నారు.