37.2 C
Hyderabad
May 6, 2024 21: 54 PM
Slider ముఖ్యంశాలు

ప్రతి పైసా సీఎం చేతిలోనే

#pawankalyan

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వ పాలన తీరుపై విమర్శలు సంధించారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉందటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. వైసీపీ పాలనపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. “అరకులో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి.. కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లాడుతున్నారు. ఇదో విచిత్రం..! ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా అయిపోయారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. నిజంగా ఇదో గొప్ప కళాఖండం” అంటూ పవన్​ కల్యాణ్ ధ్వజమెత్తారు.

Related posts

కాంట్రవర్సీ: ట్రాఫిక్ పోలీసులతో సిఎం మేనల్లుడి(?) రభస

Satyam NEWS

చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం

Satyam NEWS

11వ PRC ప్రకారం కనీస వేతనం రూ.24000 ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment