వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమృత సాగర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమృత సాగర్ మాట్లాడుతూ వైయస్సార్ సిపి పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ తమ వంతు కృషిచేయాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన పథకాలను ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దేనని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సాగర్ కొండూరు చంద్రశేఖర్ నాగర్ కర్నూల్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఇ ఎన్ డి హుస్సేన్ కల్వకుర్తి తాలూకా మైనార్టీ ప్రెసిడెంట్ కమాల్ పాషా పట్టణ అధ్యక్షులు కుద్ధూస చారగొండ మండల అధ్యక్షులు కట్ట వెంకటేష్ వెల్దండ మండల అధ్యక్షులు ఎండి జాంగిర్
ఆమనగల్ మండల అధ్యక్షులు రామ్ రహీం మాడుగుల మండల అధ్యక్షులు కలకొండ విక్రమ్ జూపల్లి గ్రామ అధ్యక్షులు అక్కి సాయిలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.