పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శనివారం శివుని బొమ్మ సెంటర్ వద్ద మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ బి. చిన్న ఓబులేసు చలివేంద్రం ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా , వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి క్లబ్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రంలో మజ్జిగ ప్యాకెట్లు, ఖర్జూర పండ్లు, మంచి నీరు ను అందచేస్తున్నారు.
ఈ సందర్భంగా చిన్న ఓబులేసు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎండ వేడి తీవ్రత దృష్ట్యా ఇటువంటి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని స్వచ్చంద్ద సంస్థలకు పిలుపు నిచ్చారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్, వాసవి క్లబ్ వారిని అభినందించారు. వాసవి క్లబ్ కేశవరావు మాట్లాడుతూ సమాజసేవలో తమవంతు సేవ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి కేశవరావు, చేగు వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్, బత్తుల మురళి,తటవర్తి నాగరాజు, జుజ్జూరు శేఖర్ బాబు, పూనూ రి కృష్ణకుమారి, రావి క్రింది సుబ్బారావు, చిలకల రాంబాబు, వాసవి తదితరులు పాల్గొన్నారు.