31.2 C
Hyderabad
May 12, 2024 01: 14 AM
Slider గుంటూరు

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో చలివేంద్రం ప్రారంభం

#waterhut

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శనివారం శివుని బొమ్మ సెంటర్ వద్ద మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ బి. చిన్న ఓబులేసు చలివేంద్రం ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా , వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి క్లబ్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రంలో మజ్జిగ ప్యాకెట్లు, ఖర్జూర పండ్లు, మంచి నీరు ను అందచేస్తున్నారు.

ఈ సందర్భంగా చిన్న ఓబులేసు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎండ వేడి  తీవ్రత దృష్ట్యా ఇటువంటి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని స్వచ్చంద్ద సంస్థలకు పిలుపు నిచ్చారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్, వాసవి క్లబ్ వారిని అభినందించారు. వాసవి క్లబ్ కేశవరావు మాట్లాడుతూ సమాజసేవలో తమవంతు సేవ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి కేశవరావు, చేగు వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్, బత్తుల మురళి,తటవర్తి నాగరాజు, జుజ్జూరు శేఖర్ బాబు, పూనూ రి కృష్ణకుమారి, రావి క్రింది సుబ్బారావు, చిలకల రాంబాబు, వాసవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆంక్షలు కఠినం.. అవసరమైతే లోకల్ లాక్ డౌన్

Satyam NEWS

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Satyam NEWS

గంగపుత్రుల సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకో

Satyam NEWS

Leave a Comment