30.7 C
Hyderabad
April 29, 2024 06: 22 AM
Slider విజయనగరం

ధ‌ర‌లు దిగిరావాలి…జ‌గ‌న్ దిగిపోవాలి…అంటూ టీడీపీ ధ‌ర్నా…!

#vijayanagaramtdp

రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు  అన్ని జిల్లాల్లోనూ ప్ర‌తిపక్ష టీడీపీ  ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు కేంద్ర మాజీ మంత్రి,పార్టీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు,మాన్సాస్ చైర్మ‌న్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు సొంత నియోజ‌క‌వ‌ర్గం మైన విజ‌య‌నర‌గం జిల్లా కేంద్రంలో  టీడీపీ ఆందోళ‌న చేప‌ట్టింది.

ధ‌ర‌లు దిగిరావాలి…జ‌గ‌న్ దిగిపోవాలి…అంటూ న‌గ‌రంలోని  గంట‌స్థంభం వ‌ద్ద ధ‌ర్నా కు దిగింది. ఈ ద‌ర్నాలో పార్టీ జిల్లాకు చెందిన నేత‌లు ఐపీవీ రాజు, టీడీపీ మహిళా మోర్చ జిల్లా అధ్య‌క్షురాలు  అనురాధ బేగం పార్టీకి చెందిన నేత‌లంతా పాల్గొన్నారు. పెంచిన ధ‌ర‌లు త‌గ్గించాల‌ని అలా చెయ్య‌లేన‌ప్పుడు జ‌గ‌న్ దిగిపోవాలంటూ పార్టీ నేత ఐపీవీరాజు డిమాండ్ చేసారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ధ‌ర‌లు అదుపులో  లేవ‌ని…పెట్రోల్,గ్యాస్ ధ‌రాలు అమాంతం పెరిగాయ‌న్నారు.వీటిని నియంత్రించాల్సిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు  వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. పెట్రోల్, గ్యాస్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతూ ఉంటే జ‌గ‌న్..త‌న కుటుంబంతో పుట్టిన రోజు వేడుక‌ల కోసం సిమ్లాలో కూర్చొన్నారంటూ టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది.

Related posts

కొడంగల్ లో ఆటో యూనియన్ ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

మళ్లీ అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment