29.2 C
Hyderabad
May 11, 2024 00: 28 AM
Slider విజయనగరం

కాఠిన్యం ,లాఠిన్యంతో కాదు…ప్రేమ,నమ్మకమే నా ఆయుధాలు

#rajakumari IPS

జిల్లా ను వదిలి వెళ్లాలంటే బాధగా ఉందన్నారు… విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. రెండేళ్ల పాటు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన ఎస్పీ రాజకుమారీ కి డీఐజీ గా అమరావతికి వెళ్లిపోనున్నారు.

ఈ సందర్భంగా నగరంలోని ప్రదీప్ నగర్ లోని మెట్రో ఫంక్షన్ హాలులో అభినందన వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అంటే కాఠిన్యంతో పని చేస్తారని తాను మాత్రం ప్రేమ ,నమ్మకం తో పని చేస్తానని చెప్పారు.

తనకు మొదట్లో విజయనగరం వేస్తే కోస్టల్ ఏరియానా….వెళ్లకూడదని అనుకున్నాననీ కానీ ప్రభుత్వ ఆదేశాలు శిరసావహించాలనే భావనతో జిల్లా కు వచ్చానన్నారు.

గడచిన కరోనా పేండమిక్ సమయం నన్ను జిల్లా కు మరింత హత్తుకునేలా చేసిందన్నారు. మరీ ముఖ్యంగా శాఖా సిబ్బంది, వైద్య ఆరోగ్య ,రెవిన్యూ యంత్రాంగం తో జిల్లా ను మరింతగా పెనవేసుకుందన్నారు.

ఈ సందర్భంలోనే ఎస్పీ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని మాట్లాడారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ తాను ముగ్గురు ఎస్పీలతో పని చేసానన్నారు.

కార్యక్రమంలో విశేష మేంటంటే ఎస్పీ రాజకుమారీ కుటుంబం అంతా అమ్మ ,నాన్న ,భర్త, పిల్లలు హాజరయ్యారు. దీనివలన కాస్త ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది.

Related posts

ప్రముఖ నటుడు బాలయ్య మృతి

Satyam NEWS

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

Satyam NEWS

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మతపిచ్చి

Satyam NEWS

Leave a Comment