36.2 C
Hyderabad
April 27, 2024 19: 18 PM
Slider మహబూబ్ నగర్

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే చేపట్టాలి

#CPM Narayanpet

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను చేపట్టి జిల్లా కు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని CPM పిలుపునిచ్చింది. నారాయణపేట జిల్లా లోని దామరగిద్ద మండలం లక్ష్మీపూర్ గ్రామంలో CPM 5 వ మహాసభలు జరిగాయి.

ఈ సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి G వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ప్రజలపై రోజు రోజు భారాలు అధిక మౌతున్నాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అశాంతి రేగుతోందని ఆయన తెలిపారు.

మతాల మధ్య విద్వేషాలు రగిల్చి అమాయక  ప్రజల ప్రాణాలను బిజెపి బలితీసుకుంటోందని ఆయన అన్నారు. బిజెపి మతోన్మాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. సభ ప్రారంభం సందర్భంగా గ్రామ కార్యదర్శి సాయిలు జండావిష్కరణ చేశారు. మహాసభ లో చేసిన తీర్మానాలు

1)నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలి. లక్ష్మీపూర్ చెరువు ద్వారా సాగునీరు అందివ్వాలి.

2)అర్హులందరికీ పెన్షన్ ,రేషన్ కార్డు లు ఇవ్వాలి.

3)అర్హులందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి

రానున్న కాలంలో పై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని CPM మండల కార్యదర్శి గోపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ బాబు, సాధు, కాన్కప్ప ప్రభు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, నారాయణపేట

Related posts

సద్దుల బతుకమ్మ వేళ బస్తీలలో మురికి కంపు

Satyam NEWS

అవినీతి పోలీసు అధికారికి డిమోషన్

Bhavani

పారిశుధ్య కార్మికులను సన్మానించిన విహెచ్

Satyam NEWS

Leave a Comment