వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఎంపిపి గూడెపు శ్రీనివాసు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధి లోని బూరుగడ్డ పి ఎ సి ఎస్ కార్యాలయంలో గోడౌన్ నిర్మాణానికి నాబార్డ్ నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శనివారం పి ఏ సీ ఎస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు,సర్పంచ్ ఎస్ కే సలిమా రంజాన్ బేగం తో కలిసి ఎంపిపి గూడెపు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఋణాలు, సబ్సిడీ పై విత్తనాలు,ఎరువులు అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,వెంకయ్య,ఎంపిటిసి మచ్చ వెంకటేశ్వర్లు,అరుణ్ కుమార్ దేశ్ ముక్,సి ఈ ఒ కీర్తి వెంకటేశ్వర్లు,సొసైటి డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్